తెలంగాణ,ఏప్రిల్ 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి 3గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణశాఖ తెలిపింది.ఎల్లుండి (ఆదివారం) రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.గతేడాది కంటే ఈసారి ఎండలు మండిపోతున్నాయి.. బయటకు రావాలంటేనే ప్రజలు భయ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది…
అవసరమైతే తప్ప బయటకు రాకండి:వాతావరణశాఖ
RELATED ARTICLES



