అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలి
:ఫిబ్రవరి 7న లక్ష డప్పులు,వెయ్యి గొంతుల మహా ప్రదర్శన విజయవంతం చేయాలి:యాతాకుల రాజన్న మాదిగ
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 03 (ప్రతినిధి మాతంగి సురేష్)తెలంగాణ రాష్టంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వెంటేనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రాజన్న మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జి
జిల్లా అధికార ప్రతినిధి ఏపూరీ రాజు మాదిగ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ రోడ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గోడపత్రికలు ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ మాదిగలు హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు
ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగేబోయే లక్ష డబ్బులు
వేల గొంతుకలు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కానీ విని ఎరుగని రీతిలో హైదరాబాద్ నగరంలో జరిగే మహా సాంస్కృతిక ప్రదర్శనను జయప్రదం చేయడం కోసం మాదిగ ఉప కులాల ప్రజలు డప్పు సంకనేసుకుని ఊరికి ఒక బస్సు తీసుకుని కోదాడ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలిరావాలని తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ పై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి మంత్రివర్గంలో తీర్మానం చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి రాష్ట్ర నాయకులు యలమర్తి రాము మాదిగ,గంధం పాండు,చీమ శ్రీనివాస రావు,కర్ల కాంతారావు,ఎంజెఎఫ్ రాష్ట్ర నాయకులు పడిశాల రఘు మాదిగ,బంకా వెంకటరత్నం,జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి సత్యరాజు మాదిగ,విహెచ్పిఎస్ జాతీయ నాయకులు కర్ల విజయరావు మాదిగ,జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ,జిల్లా కార్యదర్శి బొడ్డు కుటుంబరావు మాదిగ,విహెచ్పిఎస్
రాష్ట్ర మహిళా నాయకురాలు రావి స్నేహలత చౌదరి,జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు,నియోజకవర్గ అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్,ఆరు మండలాల అధ్యక్షులు
మిట్టగనుపుల మోషయ్య మాదిగ,లంజపల్లి శ్రీను మాదిగ,గుడిపాటి కనకయ్య మాదిగ,ములుగురి సైదులు మాదిగ,కొండపల్లి సూర్యప్రకాష్ మాదిగ,గద్దల అశోక్ మాదిగ,కొండపల్లి జాను మాదిగ,కొండపల్లి బిక్షం,పట్టణ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు
వల్లభట్ల వంశీ,కుడుముల వెంకట్,పిడమర్తి మధు,ఏపూరి పుల్లయ్య మాదిగలు పాల్గొన్నారు….