ఆర్అండ్బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ,జూన్ 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఆదివారం హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నీటిపారుదల, ఆహార,పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి,కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఆర్అండ్బి శాఖ పనులను సీఈ (ఆర్అండ్బి) మోహన్నాయక్, రాజేశ్వర్ రెడ్డి,సిఈ (భవనాలు),& ఇతర ఆర్అండ్బి అధికారులతో కలిసి సమీక్షించారు.ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ,19 జూన్ న శంఖుస్థాపన చేసిన ఆర్అండ్బి పనులు,నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఈ క్రింద మంజూరైన రోడ్లకు త్వరగా టెండర్లు పిలవాలని వారు కోరారు.1. అనంతగిరి నుండి చనుపల్లికి డబుల్ రోడ్డు (రూ. 20 కోట్లు) 2. బరఖత్గూడెం నుండి కేఆర్ సి పురం వరకు డబుల్ రోడ్డు (రూ.20కోట్లు) 3. ఎన్ హెచ్ 9 నుండి మోతె వరకు డబుల్ రోడ్డు (రూ. 25 కోట్లు) 4. మల్లారెడ్డిగూడెం నుండి రేవూరు మీదుగా రామాపురం వరకు డబుల్ రోడ్డు (రూ. 20 కోట్లు) 5. అమరవరం నుండి అలింగాపురం వరకు డబుల్ రోడ్డు (రూ. 23 కోట్లు) 6. నేరేడుచెర్ల నుండి దూపాడు వరకు డబుల్ రోడ్డు (రూ. 26 కోట్లు).అలాగే కొత్తగా ఏర్పడిన అనంతగిరి,పాలకీడు,చింతలపాలెం మండలాల్లో ఈ మధ్య మంజూరు చేయించిన తహశీల్దార్,ఎంపీడీఓ,పోలీస్ స్టేషన్ల కార్యాలయ భవనాలను వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని హుజూర్నగర్, కోదాడ ఎమ్మెల్యేలు సూచించారు.



