ఆర్ఎంపీ వైద్యం వికటించి విద్యార్థిని మృతి
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్): ఆర్ఎంపి వైద్యం వికటించి విద్యార్థిని మృతి చెందిన ఘటన చిలుకూరు మండల పరిధిలోని బేతవోలు గ్రామంలో చోటుచేసుకుంది. బడే సాహెబ్, బంధుమిత్రులు తెలిపిన వివరాల ప్రకారం… నడిగూడెం కస్తూర్బా స్కూల్లో సుహాన (13) 8వ తరగతి చదువుతుంది. మూడు రోజుల క్రితం జ్వరం వస్తుందని ఇంటికి వచ్చింది. గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ ను ఆశ్రయించగా జ్వరానికి సంబంధించిన టెస్టులు చేపించుకొని రమ్మని తెలిపారు. టెస్టులన్నీ ఆర్ఎంపి డాక్టర్ కు చూపించగా ఎక్కువ మోతాదులో ఇంజక్షన్ ఇవ్వడంతో అక్కడికక్కడే ఫిట్స్ వచ్చి మృతి చెందిందని మేనమామ బడే సాహెబ్ అన్నారు..



