Thursday, December 25, 2025
[t4b-ticker]

ఉద్యమకారులకు సంక్షేమ పథకాల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి.:గద్దర్ అన్న యాదిలో సభ కు యువత కదం తొక్కాలి:ఓయు జేఏసి నాయకులు కందుల మధు

:సెప్టెంబర్ 17 గద్దర్ అన్న యాది లో సంస్మరణ సభకు ఉద్యమకారులు ప్రజా గాయకులు వేలాదిగా తరలి రావాలి.
:గజ్జ కట్టి పాట ద్వారానే రాష్ట్రం సాధించుకున్న ఉద్యమకారులు ఏకం కావాలి:డా,, కందుల మధు

కోదాడ,సెప్టెంబర్ 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: ఈనెల17న కోదాడ బాలురు ఉన్నత పాఠశాలలో జరిగే గద్దర్ అన్న యాదిలో సంస్మరణ సభకు యువత,ప్రజా సంఘాలు,కళాకారులు,గద్దర్ అన్న వాదులు కదం తొక్కాలని ఓయూ జేఏసీ నాయకులు కందుల మధు పిలుపునిచ్చారు.ఆదివారం కోదాడ పట్టణంలో గ్రాండ్ అతిధి హాల్ లో కోదాడ నియోజకవర్గ ఆరు మండలాల తెలంగాణ ఉద్యమకారులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఓయూ జేఏసీ నాయకులు డా,, కందుల మధు పాల్గొని మాట్లాడుతు తెలంగాణ కోసం తొలి దశ నుండి మలిదశ వరకు జీవితాలను త్యాగం చేసిన ఉద్యమకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఉద్యమకారులను గుర్తించిన రాజకీయపక్షాలకే భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు.ప్రజా సంఘాలు ఉద్యమకారులను గుర్తించే రాజకీయ పక్షాలు సెప్టెంబర్ 17న జరగబోయే గద్దర్ అన్నయ్య యాదిలో సభ లో భాగస్వాములు కావాలన్నారు.

ఈ సందర్భంగా ఆరు మండలాలకు సన్నాక సభ కార్యక్రమం విజయవంతానికి కమిటీలను నియామకం చేశారు.అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఓయూ అధ్యక్షులు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ మరియు మండల కో ఆర్డినేటర్లుగా మాతంగి మురళి,వినోద్,రావినాయక్,మేకల వీరబాబు నవీన్,బండి గోపి, చింతల సాయిగోపి,కూరపాటి క్రాంతి కుమార్,కే సాయి పలువురు ఉద్యమ నాయకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular