Tuesday, July 8, 2025
[t4b-ticker]

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్.

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్.

Mbmtelugunews//కోదాడ,మార్చి 27(ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సామినేని ప్రమీల రమేష్,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సామినేని ప్రమీల,కందుల కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన మహిళా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే అని అలాగే ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అని ఈ సందర్భంగా కొనియాడారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గంధం యాదగిరి,పెండం వెంకటేశ్వర్లు,షాబుద్దీన్,కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్,మధార్,షఫీ,సుబ్బారావు,కోటిరెడ్డి,స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular