కాటేసిన పాము కోసం వెతికి చనిపోయాడు.
Mbmtelugunews//గుంటూరు జిల్లా, సెప్టెంబర్ 09:కాటేసిన పామును చంపాకే చికిత్స చేయించుకోవాలనుకున్న వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బర్మాకు చెందిన కొండన్న (38) ఎంఏ బుద్ధిజం చదువుతున్నారు. శనివారం పుట్టగొడుగులు కోస్తుండగా రక్తపింజరి కాటేసింది. రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు దాని కోసం వెతికి దొరకడంతో చంపేశాడు.ఆ తర్వాత మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు చికిత్స ప్రారంభించారు.అప్పటికే ఆలస్యం కావడంతో కొండన్న చనిపోయాడు.



