:వివాహ సంబంధ కేసులు సత్వరం పరిష్కరించాలి.
:కేసులను పరిష్కరించేందుకే అదనపు కోర్టులు మంజూరు.
:న్యాయవాదులు వృత్తికి వన్నెతేవాలి.
:న్యాయవాద వృత్తి గౌరవప్రదమైనది.
:న్యాయవ్యవస్థ బలోపేతానికి కోదాడ బార్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయం:హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే.
కోదాడ,ఫిబ్రవరి 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కేసులు పెండింగ్లో ఉంచకుండా సామాన్య మానవునికి సత్వరం న్యాయం జరిగే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే అన్నారు.శనివారం కోదాడ కోర్టులో సబ్ కోర్టు అదనపు జూనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ప్రారంభోత్సవంతోపాటు కోదాడ కోర్టు భవనానికి శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడుతు వివాహ సంబంధాల వివాదాలతో న్యాయం కోసం కోర్టు కోస్తున్న మహిళలను పదేపదే కోర్టులకు తిప్పకుండా సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.పెండింగ్ కేసులను తగ్గించేందుకే అదనపు కోర్టులను మంజూరు చేస్తున్నామని చెప్పారు.న్యాయవాదులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకొని న్యాయవ్యవస్థకు వన్నె తేవాలన్నారు.కోదాడ బార్ అసోసియేషన్ న్యాయవ్యవస్థ ప్రతిష్టతకు చేస్తున్న కృషిని అభినందించారు.హైకోర్టు జడ్జిలు వినోద్ కుమార్,లక్ష్మణ్,విజయ సేనా రెడ్డి,పుల్లా కార్తీక్ లు మాట్లాడుతూ సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్య విలువలను అందించాలని సూచించారు.

భవిష్యత్ తరాలు న్యాయవాద వృత్తిని స్వీకరించే విధంగా ఆదర్శంగా నిలవాలన్నారు.అదనపు కోర్టులు కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడతాయన్నారు.నూతన భవన నిర్మాణాన్ని కోదాడ బార్ అసోసియేషన్ కాలయాపన చేయకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు.కోదాడలో కోర్టుల భవన నిర్మాణాలు చారితాత్మకంగా నిలవాలన్నారు.బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవబతిని నాగార్జున మాట్లాడుతూ కోదాడ కోర్టు నిర్మాణానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోదాడ బార్ అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.కోదాడకు అదనపు కోర్టులు మంజూరు చేయడం తో కక్షిదారులు దూరప్రాంతాలకు వెళ్లకుండా కోదాడలోనే న్యాయం పొందే అవకాశం కలిగిందన్నారు.కోదాడకు అడిషనల్ జిల్లా కోర్టును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా నాలుగు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో రాణిస్తున్న సుధాకర్ రెడ్డి,రాధాకృష్ణమూర్తిలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.జిల్లా జడ్జి రాంగోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వెంకట్రావు,ఎస్పీ రాహుల్ హెగ్డే,హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లా నాగేశ్వరరావు,కొల్లి సత్యనారాయణ,కోదాడ జూనియర్ సివిల్ జడ్జి భవ్య,బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గాలి శ్రీనివాస్ నాయుడు,ప్రధాన కార్యదర్శి సాధు శరత్ బాబు,జాయింట్ సెక్రటరీ సీతారామరాజు,కోశాధికారి పాష,కార్యదర్శి రాజు,సూర్యాపేట డిఎస్పి రవి,కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల,మునిసిపల్ కమిషనర్ రమాదేవి,సీనియర్,జూనియర్ న్యాయవాదులు,పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



