కోదాడ బాప్టిస్ట్ చర్చిలో
ఘనంగా జరిగిన గణతంత్ర వేడుకలు
Mbmtelugunews//కోదాడ, జనవరి 26( ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘంలోని ప్రార్థనాపరులైన ప్రజలు ప్రత్యేకంగా పాల్గొని ప్రజా ప్రతినిధులు, అధికారులు, దేశ ప్రజల క్షేమం కొరకు రైతుల క్షేమం కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.

పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ అనేకమంది మహనీయులు ప్రాణాలు అర్పించి ఈ స్వాతంత్రాన్ని మనకు తెచ్చి పెట్టారని వారి ప్రాణ త్యాగాలు వ్యర్థము కాకూడదని ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి కలిగి దేశం కొరకు ఏదైనా చేయాలి అన్న ఒక సద్భక్తితో ప్రజలు ఉండవలసిన అవసరత ఉన్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ మాజీ కోఆప్షన్ సభ్యురాలు వంటేపాక జానకి ఏసయ్య, బిషప్ ఏజే సామిల్, సుందర్ రావు, శాంత వర్ధన్, డేవిడ్, ప్రభుదాస్, డేవిడ్, శాంత వర్ధన్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.



