గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్..!
సూర్యాపేట,జులై 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:హాస్టల్లో కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది.. బీర్లు తాగుతోంది.

సూర్యాపేట – బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో రాత్రిళ్లు గదుల్లో ప్రిన్స్ పాల్ శైలజ మరియు కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులు చూడకుండా తమను కొడుతుందని నిరసన తెలిపారు.
విద్యార్థినుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది.