Monday, December 29, 2025
[t4b-ticker]

గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను వెలికి తీయాలి

గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను వెలికి తీయాలి

:క్రీడలు మానసిక ఉల్లాసానికి ద్రోహదపడతాయి

:క్రీడాకారులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి

:వేసవి ఉచిత వాలీబాల్ శిబిరాన్ని సందర్శించిన సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నామ నరసింహారావు

కోదాడమే 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు పంది కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉచిత వాలీబాల్ శిక్షణను సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నామా నరసింహారావు ఎంబిఎం బ్లడ్ డోనర్స్ ట్రస్ట్ అధినేత మాతంగి సురేష్ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు మాతంగి సైదులు శుక్రవారం సందర్శించినారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు వ్యాయామంతో మంచి లక్షణాల అలవర్చుకోవాలని క్రీడల ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు.చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి అలవాట్లు అలవర్చుకోవాలని పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సరైన క్రీడల వసతి లేక ఎంతోమంది క్రీడాకారులు మరుగున పడిపోతున్నారని వారిని వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఇప్పటికే గ్రామాలలో చాలావరకు క్రీడలు అంతరించిపోయాయని ఈ క్రీడలు లేకపోవడం వలన పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేసవిలో కూడా మంచి సమయాన్ని వెచ్చించి క్రీడాకారులను తీర్చిదిద్దడానికి తన వంతు శాయశక్తుల కృషి చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు పంది కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రాబోయే రోజులలో క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కళ్యాణ్ కీలక పాత్ర పోషించాలని అన్నారు.క్రీడాకారులు ఇలాంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడలలో చదువులలో రాణించి విద్యార్థి దశలోనే శారీరకదారుఢ్యం పెంపొందించుకోవాలని అన్నారు.శారీరకదారుఢ్యం పెంపొందించుకోవడం వలన రాబోయే రోజులలో మంచి ఉద్యోగాలు పొందేటప్పుడు ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తు చేశారు.క్రీడాకారులకు ఆటల యొక్క మెలకువలు వారికి వివరించడం జరిగింది.అనంతరం క్రీడాకారులకు పౌష్టిక ఆహారాన్ని అందించారు.అనంతరం సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నామా నరసింహారావుని,ఎంబిఎం బ్లడ్ గ్రూప్ ట్రస్ట్ అధినేత మాతంగి సురేష్ ని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు మురళి సన్నీ,యాకోబు,తరుణ్,వంశీ,రవిబాబు,దిలీప్,సత్యం,కార్తీక్,రవితేజ,చైతన్య,కమలహాసన్,నాగచైతన్య,నాగ పృద్వి,సందేశ్,కోచ్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular