Saturday, April 4, 2026
[t4b-ticker]

ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ

ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ

Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 04(ప్రతినిధి మాతంగి సురేష్): యేసు ప్రభువువారి ఈస్టర్ పండుగ సందర్భంగా కోదాడ పట్టణంలో నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య పాస్టర్ ఆర్గనైజేషన్ తో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరత్నం బాబు హాజరై జండా ఊపి రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు పండుగలు పట్టణంలో ఎంతో శాంతియుతంగా క్రైస్తవులు జరుపుకుంటారని ఈ ర్యాలీ ఏసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన సందర్భంగా క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో వీధుల్లో పరిగెడుతూ నినాదాలతో దేవుని స్తుతిస్తారని కొనియాడారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ ప్రపంచవంతటా క్రైస్తవులు జరుపుకునే అతిపెద్ద పండుగ గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగలు అని ఇవి ఎంతో శాంతియుతంగా క్రైస్తవులు జరుపుకుంటారని సర్వమానవారికి ఏసుప్రభు రక్షకుడిగా మానవాళి పాపం కొరకు చనిపోయి తిరిగి లేచాడని కొనియాడారు.
ఆరు మండలాల నుంచి ప్రజలు తండోపతండాలుగా పాల్గొని ఏసుప్రభు కొరకు పరుగు అని నినాదం చేస్తూ ఎంతో ఉత్సాహంగా పరుగులు తీశారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ ఫెలోషిప్ కోర్ కమిటీ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ శ్రావణ్ కుమార్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రెవ డాక్టర్ యేసయ్య, కోర్ కమిటీ వర్కింగ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గుడిబండ ఏసయ్య, నియోజకవర్గ ప్రెసిడెంట్ బ్రదర్ రామారావు, టౌన్ ప్రెసిడెంట్ సైమన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాస్, నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్, సెక్రెటరీ కొర్నేలీ, యూత్ ప్రెసిడెంట్ సురేష్, పంది తిరపతయ్య, రాంబాబు, పౌలు చారి, అనంతగిరి ప్రెసిడెంట్ రాజేష్, మోతే ప్రెసిడెంట్ లాజర్, నల్గొండ ప్రెసిడెంట్ గాబ్రియల్, ఇంకా స్త్రీలు పురుషులు యవనస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular