కోదాడ,ఆగష్టు 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జర్నలిస్టుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక యూనియన్ టిడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ మాత్రమేనని సీనియర్ జర్నలిస్ట్ లావుడియా రమేష్ అన్నారు.. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు సంఘం నుండి తన సభ్యత్వాన్ని రద్దు చేసుకొని,తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ టిడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ లో ఆ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సభ్యత్వం తీసుకున్నారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ వారధిగా ఉంటూ నిత్యం జర్నలిస్టు సమస్యలపై మరియు ఇండ్ల స్థలలకై పోరాడుతున్న యూనియన్ టి డబ్ల్యూ జే హెచ్ 143 మాత్రమే అన్నారు.యూనియన్ యొక్క విధి విధానాలకి ఆకర్షితుడై యూనియన్ లో సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ అభినందనలు తెలిపారు.వారితోపాటు యూనియన్ నాయకులు,జర్నలిస్టులు రమేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు పడిశాల రఘు టీయూడబ్ల్యూజే హెచ్ 143 ప్రధాన కార్యదర్శి మాతంగి సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా సహాయ కార్యదర్శి నూకపంగు గోపాలకృష్ణ , జర్నలిస్టు నూకపంగు ఈదయ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యలపైటి యు డబ్ల్యు జే హెచ్ 143 యూనియన్ అలుపెరగని పోరాటం.:యూనియన్ సభ్యత్వం తీసుకున్న సీనియర్ జర్నలిస్టు రమేష్.:యూనియన్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తా.
RELATED ARTICLES