జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.
Mbmtelugunews//కోదాడ,జనవరి 13(ప్రతినిధి మాతంగి సురేష్):నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సూర్యాపేట జిల్లా టియుడబ్ల్యూజే 143 యూనియన్ అధ్యక్షులు వజ్జే వీరయ్య, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ కు ధన్యవాదాలు.కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని నియోజకవర్గ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలచలం నరేష్ అన్నారు.సోమవారం ఆయనమాట్లాడుతూ…కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా కొలిచలం నరేష్ ను నియమించినందుకు సూర్యాపేట జిల్లా టియుడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ అధ్యక్షులు వజ్జే వీరయ్య, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.యూనియన్ జిల్లా నాయకుల ఆదేశాలతో ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తానని తెలిపారు.నాపై నమ్మకం ఉంచి నాకు ఇచ్చిన పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.టియుడబ్ల్యూజే 143యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నారపరాజు హరికిషన్,టీయూడబ్ల్యూజే 143 యూనియన్ నియోజకవర్గ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాస్,నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు సలహాలు సూచనలతో యూనియన్ బలోపేతంలో భాగంగా ముందుకు కొనసాగుతానన్నారు.



