కోదాడ మండలం దొరకుంట గ్రామంలో తాగునీటి కష్టాలు.
:అసెంబ్లీ ఎన్నికల్లో మండలంలో దొరకుంట గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ.
:అమ్మ,పద్మావతమ్మ త్రాగునీటి కష్టాలు తీర్చాలంటూ మహిళల వేడుకోలు.
కోదాడ,మార్చి 06(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:మండలం దొరకుంట గ్రామంలో తాగునీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. మహిళలు వీధుల్లో ఖాళీ బిందెలతో త్రాగునీటి కష్టాలు తీర్చాలంటూ నిరసనలు తెలుపుతున్నారు.ముఖ్యంగా గ్రామంలోని హరిజనవాడలో సరైన నీటి సరఫరా లేక త్రాగేందుకు గుక్కెడు నీరు రాక కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తమ గోడును ఎవరికి చెప్పుకున్న పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామపంచాయతీ ట్యాంకర్ ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రామంలో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి పనులకు కాంట్రాక్టర్ అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తున్నారు.

ఇదేమిటని అడగగా కాంట్రాక్టర్ కు ఊరికే ఇవ్వడం లేదు 300 రూపాయలు చెల్లిస్తేనే ఇస్తున్నామంటూ సమాధానం చెబుతున్నారు.కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ మండలం దొరకుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చింది.అమ్మ పద్మావతమ్మ మా త్రాగునీటికష్టాలు తీర్చాలంటూఎమ్మెల్యేను వేడుకుంటున్నారు.



