నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Mbmtelugunews//అమరావతి,అక్టోబర్ 21:
నేడు విజయనగరం జిల్లాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు.గుర్ల గ్రామంలో డయేరియా బాధితలను పరామర్శిం చనున్నారు.నెల్లిమర్ల రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్ ఎస్ ఆర్ పేట,రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించనున్నారు.
అనంతరం గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడ చికిత్స పొందు తున్న బాధితులను వివరాలు అడిగి తెలుసుకో నున్నారు. అక్కడి నుంచి గుర్ల గ్రామానికి చేరుకుని జలజీవన్ మిషన్ పనులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాను తనిఖీ చేయనున్నారు.
అక్కడి నుంచి విజయ నగరం కలెక్టరేట్ చేరుకుని జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.



