పిఎసిఎస్ రుణ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 19(ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రపురం గ్రామంలో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు లబ్ధిదారులకు పిఎసిఎస్ చైర్మన్ గోసుల రాజేష్ 8 లక్షల రూపాయల చెక్కులను రణబోతు సునీత మేకల గోవర్ధన్ కు పంపిణీ చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు కావలసిన రుణాలను ఇవ్వటానికి అందుబాటులో ఉందని రైతులు ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ వైస్ చైర్మన్ నాగిరెడ్డి సంధ్య మాజీ సర్పంచ్ నాగిరెడ్డి లింగారెడ్డి సంఘ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు