ప్రజల కోసం జీవితాలను అంకితం చేసిన ఘనత మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి కే దక్కుతుంది:తిరుపతమ్మ సుధీర్.
Mbmtelugunews//కోదాడ,జూన్ 20 (ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ మార్కెట్ కార్యాలయంలో శుక్రవారం భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ తిరుపతమ్మ మాట్లాడుతూ నీతి నిజాయితీగా అవినీతి లేకుండా 30 సంవత్సరాల నుండి కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలే వారి కుటుంబ సభ్యులుగా భావించి రెండు నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడుపుతున్న ఘనత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దేనని అన్నారు. కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి తాగునీరు, సాగునీరు, రోడ్లు, గ్రామాలలో మౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు, ఇందిరమ్మ ఇల్లు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. గత పాలన లో దోపిడీ బెదిరింపులు రాజకీయాలు చేశారని ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి వచ్చిన తర్వాత కోదాడ నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా వ్యాపారలు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు నివసిస్తున్నారన్నారు అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు వారి జీవితాలను అంకితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మెంబర్ లు వీరబాబు, మల్లు వెంకటరెడ్డి, మనెమ్మ, శ్రీనివాస్, సూర్యం సిబ్బంది తదితరులు ఉన్నారు.