బాప్టిస్ట్ చర్చ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
Mbntelugunews//కోదాడ,జనవరి 01 (ప్రతినిధి మాతంగి సురేష్):బుధవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాప్టిస్ట్ చర్చి పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని పాత చెడు అలవాట్లు వదిలిపెట్టి నూతన సమాజ స్థాపన కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్,గంధం పాండు,కుడుముల రాంబాబు,గడ్డం యేసు తదితరులు పాల్గొన్నారు.