బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
:విచారణకు ఆదేశం.
సూర్యాపేట,జులై 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినిల ఆందోళన, కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై రాష్ట్ర పౌరసరఫరాల,నీటి పారుదలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కలెక్టర్ ని ఆదేశించారు.మంత్రి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ కమిటి అధికారిగా అడనపు కలెక్టర్ బిఎస్ లత,కమిటి సభ్యులుగా డిప్యూటి సీఈవో శిరిష,సూర్యాపేట ఆర్టివో వేణుమాదవ్,ఎస్సీ అభివృద్ధి అధికారి లతను నియమిస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక అదించాలని పెర్కొన్నారు.