బీఎస్ఎన్ఎల్ ట్యాక్సీ స్టాండ్ యూనియన్ అధ్యక్షుడిగా గరిడేపల్లి రమేష్
కోదాడ,జూన్ 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ టాక్స్ స్టాండ్ యూనియన్ అధ్యక్షుడిగా గరిడేపల్లి రమేష్ గెలుపొందారు.మంగళవారం నిర్వహించిన ఎన్నికలలో మొత్తం పోలింగ్ అయిన ఓట్లు 131 కాగా ప్రత్యర్థి పై 102 ఓట్ల మెజారిటీతో రమేష్ గెలుపొందారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి సభ్యుడికి రుణపడి ఉంటానని అన్నారు.యూనియన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.అనంతరం అధ్యక్షుడిగా గెలుపొందిన గరిడేపల్లి రమేష్ కు యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు.