బ్రేకింగ్ న్యూస్
:కారు, లారీ ఢీ ఒకరు మృతి
Mbmtelugunews//కోదాడ, జూన్ 26(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట ఖమ్మం బైపాస్ రింగ్ సమీపంలో ఆంధ్రా నుండి హైదరాబాద్ వెళుతున్న ఎర్టిగా కారును గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందినారు. ఒకరికి సీరియస్ గా ఉండటంతో హాస్పిటల్ కు తరలించారు.

ఆ కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రావులపాలెం పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వారిమని తెలిపారు.



