Sunday, July 6, 2025
[t4b-ticker]

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ,జులై15(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ముస్లిం,మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక 33 వ వార్డులో మున్సిపాలిటీ నిధులు 5 లక్షల రూపాయలతో ఆధునికరించిన పీర్ల చావిడిని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకొని వారి సంక్షేమాన్ని విస్మరించారని బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు.మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.పీర్ల పండుగకు ప్రత్యేకత ఉందని పది రోజుల పాటు జరిగే పీర్ల పండుగ ఉత్సవాలు ముఖ్యంగా హిందూ,ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని అన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా ముస్లిం,మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే ను గజమాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ ఖదీర్ పాషా,ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ నయీమ్,మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు,కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రహీం,కౌన్సిలర్లు షఫీ,కోట మధు,కందుల చంద్రశేఖర్,షేక్ షఫీ,కల్లూరి పద్మజ,వంటి పులి రమా శ్రీనివాస్,కట్టే బోయిన శ్రీనివాస్, లలిత,రమేష్,ఖాజా మొయినుద్దీన్,ఖాజా,డాక్టర్ బ్రహ్మం,ప్రసాద్ రెడ్డి,నిజాముద్దీన్,ఉపేందర్ గౌడ్,బత్తుల ఉపేందర్,ముస్తఫా,పాండు,షేక్ ఉద్దండు,ఫయాజ్,ముస్తఫా,అల్తాఫ్,అబ్బు,యూసఫ్,షేక్ జానీ,నిస్సార్,అజ్జు,సలీం,ముస్లిం మైనార్టీ నాయకులు,మత పెద్దలు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular