మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 24(ప్రతినిధి మాతంగి సురేష్): శనివారం 25వ తేదీ 26 ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ శుక్రవారం పత్రికా ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ టెన్త్ నుండి ఎంబీఏ వరకు చదివి,18-40సం.రాల మధ్య వయస్సు కలిగిన ప్రతి నిరుద్యోగి క్యూఆర్ కోడ్ ద్వారా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.అలాగే తమ వెంట ఐదు సెట్లు రెస్యూమ్ లు, రెండు పాస్ ఫోటోలు తీసుకెళ్లాలని సూచించారు.ఈ జాబ్ మేళాలో పాల్గొంటే నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి లు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక రంగాలలో జిల్లాను హుజూర్ నగర్, కోదాడ ను అభివృద్ధి చేయడానికి మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి లు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు చైర్ పర్సన్ తిరుపతమ్మ తెలిపారు.



