రోడ్డు వెంబడి కంపచెట్లతో పొంచి ఉన్న ప్రమాదం
:కంప చెట్టు తొలగించండి ప్రజల ప్రాణాలను కాపాడండి
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 21(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని 12వ వార్డులో లారీల ఆఫీసు వద్ద నుండి రాంరెడ్డి పాలెం వరకు వీళ్లు దారి వెంబటి కంపచెట్ల పొదలు రోడ్డుకి ఇరువైపులా పెరగడంతో వాహనదారులకు పాదచరులకు ప్రమాదకరంగా మారినాయని పలువురు ఆపోతున్నారు. మునిసిపల్ కమిషన్ కి గతంలో తెలియచేయునది. అయినా కూడా చెట్లు తొలగించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించారని పలువురు వాపోతున్నారు. మున్సిపాలిటీ చెత్త వాహనాలన్నీ ఈరోడ్లోనే తిరగటం వలన రోడ్డు రద్దీగా ఉంటుంది వాహనదారులు పాదచరు లు రోడ్డు దిగాలంటే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకి ఇరువైపులా కంపచెట్లను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు ఆపోతున్నారు.



