Thursday, December 25, 2025
[t4b-ticker]

రోడ్డెక్కిన వైద్య సిబ్బంది.:జీవో నెంబర్ ఎం.ఎస్ 142 రద్దు చేయాలి.

కోదాడ,అక్టోబర్ 02(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:వైద్య మరియు ఆరోగ్య శాఖలో హేతుబద్ధీకరణ పేరుతో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ కార్యాలయాల ఎత్తివేత మరియు సిబ్బంది బదిలీల కు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ ఎంఎస్ 142 ను బేషరతుగా రద్దు చేయాలని 142 జీవో రద్దు కమిటీ సూర్యాపేట జిల్లా ప్రతినిధులు కోదాడ పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా 142 జీవో రద్దు కమిటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ నిరంజన్,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ 142 జీవోతో వైద్య ఆరోగ్యశాఖ ఉనికి కోల్పోతుందన్నారు.ప్రజల ఇంటి ముంగిటకు ఆరోగ్య సేవలు అందిస్తున్న శాఖను నిర్వీర్యం చేయడం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.142 జీ.వో రద్దు స్టీరింగ్ కమిటీ నాయకులు యాతాకుల మధుబాబు,అంజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్యశాఖలో ఇటువంటి జీ.వో గొడ్డలి పెట్టని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్,డాక్టర్ లక్ష్మీ ప్రసన్న,డాక్టర్ ధర్మతేజ,డాక్టర్ నవ్య,ముక్కా శ్రీను,మహేష్,కృష్ణ, అంజన్న,డాక్టర్ వైష్ణవి,డాక్టర్ ఫర్హీన్,త్రినాధ్,లింగయ్య,శైలజ,ఆరోగ్య కార్యకర్తలు విజయలక్ష్మి,ఇందిరా,రాగసుధా,మంగ,మహేశ్వరి,కళ్యాణి,కల్పన,మార్తా,రాధా,కళావతి,కల్పన, నీరజ,జ్యోతి,ధనమ్మ ,కనకదుర్గ,వెంకటనారాయణ,శ్రీదేవి,రత్న మేరీ,సుబ్బు,సురేంద్ర ,రాము ,కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular