సూర్యాపేట,మార్చి 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జిల్లాలోని లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సీనియర్ సిటీజేన్స్ కి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.కేంద్ర ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం గతంలో 80 సంవత్సరాల వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించిందని ఇప్పుడు ఎన్నికల నిబంధన 27 -ఏ క్లాజ్ (ఇ) ని సవరించి ఫామ్ 12 డి ద్వారా 85 సంవత్సరాల పై బడిన వారికి అవకాశం కల్పించిందని అర్హులైన వృద్ధులు హోమ్ ఓటింగ్ వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.
లోక్ సభ ఎన్నికల్లో వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణ.:అర్హులైన వృద్ధులు సద్వినియోగంచేసుకునే అవకాశం:జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్.
RELATED ARTICLES



