Sunday, July 6, 2025
[t4b-ticker]

షీ టీమ్స్,సైబర్ నేరాలపై అవగాహన

షీ టీమ్స్,సైబర్ నేరాలపై అవగాహన

Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 10(ప్రతినిధి మాతంగి సురేష్):ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని త్రివేణి డిగ్రీ కళాశాల లో షీ టీమ్స్,సైబర్ నేరాలపైన విద్యార్థిని,విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.ప్రతి గ్రామంలో,స్కూల్లో,కళాశాలలో చదువుకునే విద్యార్థులు,యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి,సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు,బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్,ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దు.ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు.మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు.అలాగే కాలేజి లో హాస్టళ్లు మహిళలపై వేధింపులు జరిగితే షీ టీం వాట్సాప్ నెంబర్ 8712686056కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.టీ సేఫ్ యాప్ పై మహిళలు అవగాహన కలిగియుండాలని అన్నారు.వ్యక్తిగత సమాచారం,బ్యాంకు వివరాలు,ఏటీఎం పిన్ నెంబర్లు,సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు.వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు.యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తుమందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు.సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు.అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక,పాటలతో విద్యార్దులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం నందు త్రివేణీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్,షీ టీమ్స్ ఏఎస్ఐ కృష్ణమూర్తి,షీ టీమ్ కానిస్టేబుల్ యాకూబ్,మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular