సర్పంచ్ అప్పారావుకు సన్మానం.
Mbmtelugunews//కోదాడ, జనవరి 17( ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని కాపుగల్లు గ్రామ సర్పంచ్ దొంతగాని అప్పారావును కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ యశ్వంత్ శనివారం సిబ్బందితో కలసి సన్మానించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం ఆశా వర్కర్లకు అప్పారావు చీరలు పంపిణీ చేశారు.



