సాగర్ ఎడమ కాలువలో మహిళ సెల్ఫీ దిగుతూ కాలుజారి నీటిలో పడింది.
Mbmtelugunews//నల్గొండ జిల్లా,ఆగష్టు 30:మిర్యాలగూడ నియోజకవర్గం…
వేములపల్లి గ్రామం సాగర్ ఎడమ కాలువ లో వేములపల్లి బ్రిడ్జి వద్ద ఓ మహిళ సెల్ఫ్ దిగుతూ కాలుజారి నీటిలో పడడం జరిగింది.అటుగా వెళుతున్న స్థానికులు గజలపురం గ్రామానికి చెందిన యువకులు జక్క నాగయ్య,జక్కా నాగరాజు తదితరులు వెంటనే నీటిలో దూకి తాడు సాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి కాపాడడం జరిగింది.ఏపీ నుండికారులో హైదరాబాద్ వెళుతుండగా కాలువ వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాద వశాత్తు కాలుజారి పడ్డట్టు సమాచారం.



