స్కూల్ బస్సు డ్రైవర్లు భద్రతా సూచనలను తప్పకుండా పాటించాలని:మోటార్ వాహన తనిఖీ అధికారి షేక్ జిలాని
Mbmtelugunews//కోదాడ,జూన్ 12(ప్రతినిధి మాతంగి సురేష్):స్కూల్ బస్సు డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు రహదారులపై ఉన్న భద్రతా సూచనలను తప్పకుండా పాటించాలని మోటార్ వాహన తనిఖీ అధికారి షేక్ జిలాని సూచించారు.పాఠశాల బస్సు డ్రైవర్లతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. స్కూల్స్ పున ప్రారంభం అయిన సందర్భంగా విద్యార్థులతో వెళ్లే వాహనాలలో సహాయకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.కోదాడ పరిధిలో 220 కి పైగా స్కూలు,కాలేజీ బస్సులు ఉన్నాయి.అందులో ఇప్పటి వరకి 95% వాహన సామర్థ్య పరీక్షలు చేయించినారు,మిగిలిన బస్సులు కూడా తొందరగా వాహన సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.

స్కూలు బస్సు డ్రైవర్లు నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు.స్కూల్ యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించాలి,పిల్లలను బస్సు ఎక్కించేటప్పుడు,దించేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బస్సులను ఆపాలి.డ్రైవర్లు ఓవర్ టేకింగ్ చేయకూడదు పిల్లలను గమ్య స్థానాలకు జాగ్రత్తగా చేరవేయాలి.బస్సు డ్రైవర్లు మద్యం సేవించి,సెల్ఫోన్ ఉపయోగించినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకోబడును.బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్,ఫైర్ సిలిండర్ను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.బస్సులో సీటు కెపాసిటీకి మించి స్కూల్ పిల్లలను ఎక్కించరాదు,ఎక్కించిన యెడల కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.