స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం
Mbmtelugunews//కోదాడ, జనవరి 30( ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక కెఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వివక్షను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం అనే నినాదంతో స్పర్శ్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ పట్టణ డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వి అమర్ కుమార్ హాజరయ్యి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది అని శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు కలిగి ఉండడం ఏమైనా లక్షణాలు ఉన్నట్లయితే స్థానిక ఆశా కార్యకర్తలకు ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లయితే వారిని గుర్తించి నిర్ధారణ అయినట్లయితే వారికి ఎండిటి చికిత్స విధానం ద్వారా వ్యాధిని నయంచేయవచ్చని తెలపడం జరిగింది. ఆరోగ్య సిబ్బంది ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డా, హదసరాణి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవగాహనతో ఉండాలని అన్నారు.తదుపరి ఆరోగ్య సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా, చందా అప్పారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా, నందిగామ నిర్మలకుమారి,పారా మెడికల్ సబ్ యూనిట్ ఆఫీసర్ సురేందర్, సీనియర్ అసిస్టెంట్ సునీల్, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.



