Friday, December 26, 2025
[t4b-ticker]

నేటినుండి అధ్యయనోత్సవాలు ప్రారంభం.

కోదాడ,జనవరి20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బండపాలెం లో స్వయం వ్యక్తముగా వేంచేసియున్న శ్రీ దేవల్ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి వార్షిక ధనుర్మాస ప్రయుక్త అధ్యయనోత్సవాలు నేటినుండి ప్రారంభమగుచున్నవి.ది.11 జనవరి 2024,గురువారం సాయంకాలము 6 గంటలకు తొళక్కం. 12 -1- 2024 శుక్రవారం ఉదయం 6 గంటలకు తిరుప్పావై సేవాకాలం,8గంటలకు కూడారై గిన్నెల పండుగ,9గంటలకు ద్రావిడ ప్రబంధ పారాయణ సేవా కాలం మధ్యాహ్నం మహా నివేదన,తీర్థ ప్రసాద గోష్ఠి,సాయంకాలం మరల నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ సేవా కాలం ఉండును.8గంటలకు తీర్థ ప్రసాద గోష్ఠి జరుగును.13- 1-2024,శనివారం ఉదయం 6గంటలకు ప్రాతరారాధన,కఱవైగళ్,ఉదయకాలపు సేవా కాలం,బాలభోగం,దివ్య ప్రబంధ సేవాకాలం పారాయణం ఉదయం 10గంటలకు ప్రతి నెల చేయునట్టి శ్రవణ నక్షత్ర యుక్త శ్రీ వారి మాస కల్యాణము జరుపబడును.మధ్యాహ్నం 12 గంటలకు రాజ భోగం,మహానివేదన తీర్థ ప్రసాద గోష్ఠి ఉండును.సాయంకాలము 5 గంటలకు నాలాయిర దివ్య ప్రబంధం పారాయణం 8 గంటలకు శ్రీమన్ నమ్మాళ్ళువార్ల పరమపద ఉత్సవము జరుగును.తరువాత తీర్థ ప్రసాద గోష్ఠి జరుగును.14 -1- 2024 ఆదివారం ఉదయం 6 గంటలకు శాత్తుమురై,భోగి పండుగ సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ గోదా శ్రీరంగనాథుల కల్యాణం జరుపబడును.కావున భక్తులెల్లరు దేవాలయానికి విచ్చేసి భగవంతుని సేవలో పాల్గొని తరించగలరని.అర్చకులు,చైర్మన్ ముడుంబై వేణుగోపాలాచార్యులు,స్థానాచార్యులు,మాసకల్యాణోత్సవ నిర్వాహకులు ముడుంబై లక్ష్మణాచార్యులు,కార్యనిర్వహణాధికారి,దేవాదాయ ధర్మాదాయ శాఖ టివి చలపతి లు తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular