ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి:డా,,అంజి యాదవ్
కోదాడ,మే 13(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నల్లగొండ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తో కలిసి కోదాడ నియోజకవర్గంలో పలు(కోదాడ,అనంతగిరి,మునగాల,బేతోలు,రాఘవపురం,అమీనాబాద్,గోల్ తండా,మొగలాయికోట) పోలింగ్ బూత్ కేంద్రాలను సందర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు డా,,అంజి యాదవ్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజలు స్వతంత్రంగా సద్వినియోగం చేసుకునేది ఒక ఓటు ఒకేనని ఆ ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి కిట్టు, కతిమాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



