మాధవరపు శంకర్ మరణం వారి కుటుంబానికి తీరని లోటు:సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ వెంకటేశ్వర్లు
కోదాడ,మే 19(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన మాధవరపు శంకర్ వయస్సు 58 సంవత్సరంలు శనివారం సాయంత్రం మూడు గంటల సమయంలో గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటు అని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.ఆదివారం గుడిబండ గ్రామంలో ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ శంకర్ కి 4గురు ఆడపిల్లల గలరు ఆ కుటుంబానికి పెద్దదిక్కు శంకర్ ఆ కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటు అని అన్నారు.ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు.వారి కుటుంబానికి ఎల్లవేళలా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.



