Friday, July 4, 2025
[t4b-ticker]

శేష జీవితాన్ని సంతోషంగా గడపాలి.

శేష జీవితాన్ని సంతోషంగా గడపాలి.

:పెన్షనర్లు సామాజిక సేవలో ముందుండాలి.

:రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల.సీతారామయ్య.

Mbmtelugunews//కోదాడ, జూన్ 28(ప్రతినిది మాతంగి సురేష్): విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని
ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. శనివారం సంఘం కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జూన్ నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకలను సామూహికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్ అయిన తర్వాత ఇంటి వద్ద ఒంటరిగా గడపకుండా ప్రతిరోజు సంఘ కార్యాలయానికి వచ్చి ఆట, పాటలతో సంతోషంగా గడపాలన్నారు. కోదాడ యూనిట్ వారు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం జన్మదిన వేడుకలు జరుపుకునే వారిని కేక్ కట్ చేయించి శాలువా, మెమెంటో, పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, జిల్లా సెక్రెటరీ బొల్లు రాంబాబు, పొట్ట జగన్మోహన్, హనుమారెడ్డి, వెంకటేశ్వరరావు, విద్యాసాగర్, నరసయ్య, భ్రమరాంబ, శోభ, రఘువర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular