జర్నలిస్ట్ సత్యనారాయణ మాతృమూర్తి ఆకాల మరణం బాధాకరం…
•సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కారింగుల అంజన్ గౌడ్..
Mbmtelugunews//కోదాడ ఆగస్టు 21 (మనం న్యూస్): అనంతగిరి మండల జర్నలిస్ట్ బుర్ర సత్యనారాయణ మాతృమూర్తి అనసూయమ్మ గుండెపోటుతో బుధవారం రాత్రి ఆకాల మరణం చెందడం బాధాకరమని సూర్యాపేట మాజీ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు కారింగుల అంజన్ గౌడ్ అన్నారు. కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో గురువారం అనసూయమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి అధైర్యపరవద్దని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జర్నలిస్టులు కొలిచలం నరేష్, బాలెబోయిన గోపి, గుడిమెట్ల రామకృష్ణ, భానోత్ రవిచంద్ర ఉన్నారు.



