రాంరెడ్డి మృతి బాధాకరం. ఏఎంసీ చైర్ పర్సన్ తిరుపతమ్మ సుదీర్
Mbmtelugunews//నడిగూడెం, మార్చి 27 :మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు ముదిరెడ్డి నలినిరెడ్డి తండ్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంచికంటి రామిరెడ్డి మృతి బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. శుక్రవారం ఖమ్మంలో ని ఆయన నివాసం వద్ద రాంరెడ్డి మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రామచంద్రపురం గ్రామంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ కోసం రామిరెడ్డి చేసిన సేవలు మరవలేనివన్నారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
అలుగుబెల్లి చంద్రశేఖర్ రెడ్డి, నీలిమ గాంధీ, మంచికంటి వెంకటరెడ్డి, పల్లా నాగిరెడ్డి, రాఘవరెడ్డి, తుమ్మటి వెంకటరామిరెడ్డి, ఉపేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, వెంకటరెడ్డి, ప్రభాకర్, కిన్నెర సాయిబాబు, రాఘవరెడ్డి, బజ్జురి వెంకట్ రెడ్డి, మాధవరెడ్డి తదితరు నివాళులర్పించారు.



