స్టేట్ ర్యాంక్ సాధించిన సోమపంగు శర్మని
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 12(ప్రతినిధి మాతంగి సురేష్): నేడు విడుదలైన జూనియర్ ఇంటర్ ఫలితాలలో కోదాడ పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన సోమపంగు శర్మని 470 మార్కులకు గాను 462 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచారు. శర్మని తల్లి నడిగూడెం కేజీవీబీ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తుండగా తండ్రి నాగరాజు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పిల్లలను ఉన్నతంగా చదివించాలని భావించారు, తల్లిదండ్రుల కష్టాన్ని చూసి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కష్టపడి చదివి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచటం పట్ల కళాశాల యజమాన్యం, మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు పట్టణంలోని పలువురు శర్మనీకి ప్రశంసలు అందజేశారు.



