రోడ్డు ప్రమాదాలను నివారించాలి: సర్పంచి మందుల నాగయ్య
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 13( ప్రతినిధి మాతంగి సురేష్):రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సర్పంచి మందుల నాగయ్య అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామ పంచాయతీ లో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచి మందుల నాగయ్య అధ్యక్షతన రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధులు కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించని ఆయన అన్నారు. వాహనాలు అన్నారు. అనంతరం రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి, ఎంపీడీవో, వర్క్ ఇన్స్పెక్టర్ ఈసీ పాల్గొని తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుడిబండ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ప్రజలు అధిఖ సంఖ్యలో పాల్గొన్నారు.



