చదువు పట్ల యువత శ్రద్ధ చూపించాలి
Mbmtelugunews//కోదాడ, మే 31( ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం యూత్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ ఫస్ట్ తారీకు నూతనంగా స్కూలు కళాశాలలో చేరుతున్న విద్యార్థులకు సామాజిక విషయాలపై చదువు పట్ల శ్రద్ధ పై అవగాహన కలిగించుటకు కోదాడ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య సోమవారం సాయంత్రం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన ఆహ్వాన చేతి పత్రికలు రిలీజ్ చేశారు.. ఈ పత్రిక అందిన ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి సమాజంలో యువత చెడు ప్రబోలాలకు లోన్ కాకుండా చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని అవగాహన కలిగి ఉండాలని తల్లిదండ్రుల ఆశ నెరవేర్చాలని చేసే ప్రయత్నంలో ఈ యూత్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ హాజరై యువత పెడదారిన పడుతున్న దినాల్లో చదువు పట్ల శ్రద్ధ చూపించాటానికి ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ స్త్రీలు, యవ్వనస్థులు, పెద్దలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



