మూడు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపించండి
:రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోండి
:సర్పంచి పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, జూన్ 03(ప్రతినిధి మాతంగి సురేష్):మూడు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపించండి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచి పాలకి సురేష్ అన్నారు. మండల పరిధిలోని దోరకుంట గ్రామం లో గల ఆర్అండ్ఆర్ సెంటర్ నెమలిపురి కాలనీలో అంగన్వాడి సెంటర్ నందు పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి పాలకి సురేష్ పాల్గొని పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగనవాడి కేంద్రాల ద్వారా చిన్న పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో సర్పంచి పాలకి సురేష్ ,వార్డ్ మెంబర్ కోనపర్తి తిరుమల చారి, అంగన్వాడి టీచర్ నాగమణి పిచ్చిరెడ్డి, కస్పరాజు సురేష్, మధు పిల్లల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.



