పచ్చిగోళ్ళ గురవయ్య, భారతమ్మ కుటుంబాలను పరామర్శించిన సర్పంచి గోసుల రాజేష్
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 10(ప్రతినిధి మాతంగి సురేష్):నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు పచ్చిగోళ్ళ గురవయ్య, మిర్యాల భారతమ్మ కుటుంబాలను పరామర్శించిన సర్పంచి గోసుల రాజేష్ వారి కుటుంబ సభ్యులను కలిసి మీకు కాంగ్రేస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటదని చెప్పి వారి కుమారులు పచ్చిగోళ్ళఉపేందర్, మిరియాల ఉపేందర్ కి కుటుంబానికి 5000 రూపాయలు చొప్పున రెండు కుటుంబాలకి 10000. రూపాయలు ఆర్థిక సాయం అందించినారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి కటికల పుల్లయ్య, వార్డు సభ్యులు పప్పుల ఉపేందర్, శివరాత్రి వీరబాబు, కాంగ్రెస్ నాయకులు అనంతుల ఉపేందర్, సంకోజ్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.



