ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందేలా చర్యలను
:సర్పంచి మందుల నాగయ్య
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 05(ప్రతినిధి మాతంగి సురేష్):గ్రామంలో ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందేలా చర్యల తీసుకుంటున్నామని సర్పంచి మందుల నాగయ్య అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో పాడైపోయిన బోరు మోటారును మరమ్మతులు చేయించి, తిరిగి అమర్చించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా, ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందేలా అవసరమైన చర్యలను చేపడుతున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



