Saturday, July 5, 2025
[t4b-ticker]

నిర్భయంగా రైతులు వ్యాపారాలు చేసుకోవచ్చు:మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతిమ్మ సుధీర్

నిర్భయంగా రైతులు వ్యాపారాలు చేసుకోవచ్చు:మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతిమ్మ సుధీర్

:సంతను పరిశీలించిన నూతన చైర్ పర్సన్,వైస్ చైర్మన్, డైరెక్టర్లు.

:సంతలో సమస్యలను రైతుల నుండి అడిగి తెలుసుకుంటున్న చైర్ పర్సన్

:సంతకు పూర్వ వైభవం రావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 09(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ వ్యవసాయ మార్కెట్ లో రైతులు,వ్యాపారస్తులు నిర్భయంగా వ్యాపారాలు చేసుకోవచ్చని కోదాడ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు.ఆదివారం కోదాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను వైస్ చైర్మన్ బషీర్,డైరెక్టర్లతో కలిసి పరిశించి రైతులతో మాట్లాడారు.మార్కెట్ యార్డ్ లో తాగునీరు తోపాటు పశువులకు,వ్యాపారస్తులకు,రైతులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మార్కెట్ లో సమస్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

అనంతరం చిలుకూరులో గల గోడంకు దారి లేదని రైతులు తెలపగా వెళ్లి పరిశీలించమని అన్నారు.రైతులు వాహనాలలో ఆవులను,గేదెలను తీసుకువెళ్తున్నప్పుడు పోలీసు వారు ఆపి ఇబ్బంది పెడుతున్నారని,కొంతమంది బజరంగ్దళ్ వాళ్ళమని చెప్పి ఇబ్బంది పెడుతున్నారని చైర్ పర్సన్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బషీర్,డైరెక్టర్లు వెంకటరెడ్డి,వెంకటేశ్వర్లు,శ్రీను,వీరబాబు,సూర్యం,దైవమని,వేణు,కోటయ్య,అమర్ సింగ్,శ్రీను,సెక్రటరీ రాహుల్ మార్కెట్ కమిటీ సిబ్బంది,రైతులు తదితరులు ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular