నేడు విశాఖలో కేంద్ర మంత్రి పర్యటన
mbmtelugunews//విశాఖజిల్లా, ఆగస్టు 26(ప్రతినిధి మాతంగి సురేష్):కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. నౌకాదళంలోకి ఐఎన్ఎస్ ఉదయగిరి, హిమగిరి యుద్ధనౌకల ప్రారంభ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ హాజరుకానున్నారు.
నావికాదళ అధికారులతో సమావేశమవుతారు. కాగా, తొలిసారి నౌకాదళంలోకిిి రెండు యుద్ధనౌకలను భారత నౌకాదళం అందుబాటులోకి తేనుంది. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.



