ఉపాధ్యాయ దినోత్సవంకు తేజ విద్యార్థుల వినూత ప్రదర్శన
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 04(ప్రతినిధి మాతంగి సురేష్): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక తేజ టాలెంట్ స్కూల్లో రాధాకృష్ణన్ చిత్రపటానికి విద్యార్థులు ఉత్సాహంగా మణిహార రూపంలో వినూత్నంగా ప్రదర్శన ఇచ్చారు. అంతేకాకుండా గురువు విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ఎర్రంశెట్టి సంతోష్ కుమార్, ప్రిన్సిపాల్ ఎం అప్పారావు, హై స్కూల్ ఇన్చార్జి రామ్మూర్తి, ప్రైమరీ ఇన్చార్జి రేణుక, నవ్య, పావని, లావణ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



