ఎస్సారెస్పీ రెండవ దశ కాలువకు దివంగత నేత మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కాలువగా నామకరణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
:తాగు తాగునీటి రంగంలో వెనుకబడిన తుంగతుర్తి గోదావరి జలాలు రప్పించిన ఘనుడు దామోదర్ రెడ్డి.
:కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు దివంగత నేత దామోదర్ రెడ్డి.
:దామోదర్ రెడ్డి ఆకస్మిక మరణం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.
:దివంగత నేత దామోదర్ రెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది.
:తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనీ దామోదర్ రెడ్డి బలిష్టం చేయడం వల్లనే గత ఎన్నికలలో మందుల సామెల్ కు 50 వేల మెజార్టీ.
:దామోదర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
Mbmtelugunews//తుంగతుర్తి, అక్టోబర్ 12(ప్రతినిధి మాతంగి సురేష్): రాజకీయాలలోకి వచ్చి ప్రజాసేవ కోసం సొంత ఆస్తులను సైతం ప్రజాసేవ కోసం ధారబోసిన గొప్ప నాయకుడు దివంగత నేత మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదర్ రెడ్డి అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన దామోదర్ రెడ్డి దశదిన కార్యక్రమానికి హాజరై సంతాప సభలో ప్రసంగిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం దామోదర్ రెడ్డి పేరు తెలవని వారు లేరని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు సూర్యాపేట నుండి ఒకసారి గెలుపొంది కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యూదుడని అన్నారు. ఫ్లోరైడ్ తో బాధపడుతున్న నల్లగొండ జిల్లా ప్రాంతం ప్రజలను కాపాడడానికి గోదావరి జలాలను తుంగతుర్తి ప్రాంతానికి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి అని అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాల గ్రామంలో జన్మించిన దామోదర్ రెడ్డి ఖమ్మం జిల్లా ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సైతం అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని అన్నారు. దివంగత నేత దామోదర్ రెడ్డి సోదరుడు రామిరెడ్డి వెంకటరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి అని ఇద్దరు సోదరులు జోడెడ్ల మాదిరిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారని అన్నారు. తుంగతుర్తి ప్రాంతం సూర్యాపేట ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అది దామోదర్ రెడ్డి కృషి వళ్ళని అన్నారు. దామోదర్ రెడ్డి వేసిన కాంగ్రెస్ పార్టీ బీజాలు అత్యంత పటిష్టంగా ఉండడం వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని మందుల సామేల్ 50 వేల మెజారిటీతో గెలుపొందాడని ఆ ఘనత దామోదర్ రెడ్డి దేనని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి దామోదర్ రెడ్డి ముందుండేవారిని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి దామోదర్ రెడ్డి అని అభివర్ణించారు. దామోదర్ రెడ్డి లేని లోటు కాంగ్రెస్ పార్టీలో తీర్చలేనిది అని కమిట్మెంట్తో కూడిన గొప్ప నాయకుడు కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి అని అన్నారు. దామోదర్ రెడ్డి మృతి పట్ల ఏఐసిసి అగ్ర నాయకులు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే ,రాహుల్ గాంధీలు, ప్రత్యేకంగా సంతాపం తెలిపారని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సందేశాన్ని వారికి అందిస్తున్నాని అన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అన్ని విధాల అటు ఎఐసిసి ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని అన్నారు. అలాగే ఎన్నో ఉద్యమాలు చేసి తుంగతుర్తి ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకువచ్చిన అపర భగీరధులు దామోదర్ రెడ్డి పేరును ఎస్సారెస్పీ రెండవ దశ కాలువకు నామకరణం చేస్తున్నట్లు వేలాదిమంది ప్రజల హర్షద్వారాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు .దామోదర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో మంత్రులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉత్తంకుమార్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుందూరు జానారెడ్డి, వి హనుమంతరావు, దివంగత నేత దామోదర్ రెడ్డి తనయుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి లతోపాటు పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు



