రావెళ్ళ కృష్ణారావు–మాలతి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు
:మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు ఆశీస్సులు
:దంపతులకు పలువురు నాయకులు, మిత్రుల శుభాకాంక్షలు
Mbmtelugunews//కోదాడ, మర్చి 12(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ళ కృష్ణారావు మాలతి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా దంపతులు కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు మాట్లాడుతూ రావెళ్ళ కృష్ణారావు మాలతి దంపతులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ జీవితం ఆనందంగా కొనసాగాలని ఆశీర్వదించారు. కాగా ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, మిత్రులు, బంధువులు, దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.



