రంజాన్ ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేస్తాం….
:సిబ్బంది ఈద్గా వద్ద టెంట్లు,మంచి నీరు, వసతులు, పరిసరాల శుభ్రత చూడాలి…….
:ముస్లిం సోదరులు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకోవాలి….
:ముస్లిం సోదరులకు ముందస్తు గా ఈద్ ముబారక్…
:మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు….
Mbmtelugunews//కోదాడ, మార్చి 20(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని సాలర్జంగ్ పేట లోని ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలకు కోదాడ మున్సిపల్ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శుక్రవారం ఈద్గా వద్ద ముస్లిం ల ప్రార్థన లకు మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యం లో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వేసవి తీవ్రత కు టెంట్లు, మంచి నీరు, కూర్చునేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. పరిసరాలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్ల లన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ముసిం లు రంజన్ పండుగ ఘనంగా జరుపుకోవాలన్నారు. ముందస్తుగా ఈద్ ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ మల్లీశ్వరి, కమీషనర్ రమాదేవి, కౌన్సిలర్ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు, స్థానిక నాయకులు ఉన్నారు.



